Mahindra unveil Five New Electric SUV and XUV Cars in India on February 10: ఆటో మొబైల్‌ రంగంలో 'మహీంద్రా'కు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వినియోగదారులకు గొప్ప సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళుతోంది. మహీంద్రా ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకురాబోతోంది. గత ఏడాది ఆగస్టులో యునైటెడ్ కింగ్‌డమ్‌లో న్యూ బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించింది. ఎక్స్‌యూవీ E మరియు BE సబ్-బ్రాండ్‌ల క్రింద 5 కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఉన్న మహీంద్రా మేడ్ (మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్) డిజైన్ స్టూడియోలో రూపొందించిన కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ శ్రేణిని ఫిబ్రవరి 10న భారతదేశంలో ప్రదర్శించనున్నారు. వీటిలో XUV.e8, XUV.e9, BE.05, BE.07 మరియు BE.09 మోడల్‌లు ఉన్నాయి. భారతదేశంలోని మొదటి ఫార్ములా ఇ రేస్‌కు ఒక రోజు ముందు ఈ కార్లు ప్రదర్శించబడతాయి. మహీంద్రా యొక్క రేసింగ్ ఫ్యాక్టరీ బృందం ఫార్ములా E భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.


MAHINDRA XUV.E8:
ప్రొడక్షన్ లైన్‌లోని మొదటి మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ మోడల్ XUV.e8. ఇది డిసెంబర్ 2024లో లాంచ్ కానుంది. ఆ తర్వాత XUV.e9 రానుంది. రెండు ఎస్‌యూవీలు INGLO ప్లాట్‌ఫారమ్‌పై (బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్) ఆధారపడి ఉంటాయి. XUV.e8 యొక్క ప్రాథమిక లేఅవుట్ మరియు సిల్హౌట్ మహీంద్రా XUV700 మాదిరిగానే ఉంటాయి. XUV.e8 పొడవు 4740mm, వెడల్పు 1900mm మరియు ఎత్తు 1760mmగా ఉంటుంది. వీల్‌బేస్ 2,762mm ఉంటుంది. XUV700 కంటే XUV.e8 దాదాపు 45mm పొడవు, 10mm వెడల్పు మరియు 5mm పొడవు ఉంటుంది. వీల్‌బేస్ 7mm ఎక్కువ ఉంటుందని అంచన.


MAHINDRA XUV.E9:
మహీంద్రా XUV.e9 కూపే లాంటి డిజైన్‌తో రానుంది. ఇది ఏప్రిల్ 2025 నాటికి మార్కెట్‌లోకి వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇది 4790 mm పొడవు, 1905 mm వెడల్పు మరియు 1690 mm ఎత్తు ఉంటుంది. ఇది 5-సీటర్ మోడల్ మరియు 2775mm పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది.


MAHINDRA BE:
మహీంద్రా BE.05 ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్‌లోకి రానుంది. దీని పొడవు 4370mm, వెడల్పు 1900mm మరియు ఎత్తు 1635mm. ఈ కారు వీల్ బేస్ 2775ఎమ్ఎమ్. అయితే మహీంద్రా BE.07 పొడవు 4565mm, వెడల్పు 1,900mm మరియు ఎత్తు 1,660mm. దీని వీల్ బేస్ 2,775ఎమ్ఎమ్. మహీంద్రా BE.09 కూడా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.


Tata Rival Mahindra :
ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 2022లో టాటా మోటార్స్ అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అయితే మహీంద్రా కొత్త కార్ల రాక తర్వాత.. టాటాకు గట్టి పోటీ తప్పదు. 


Also Read: Tata Nexon Price 2023: రూ 6 లక్షలకే టాటా నెక్సాన్ కార్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! ఈ అవకాశం మళ్లీ రాదు  


Also Read: Xiaomi Electric Car 2023: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సూపర్ లుకింగ్! కానీ భారీ జరిమానా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.