Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దీనితో రెండో రోజూ నష్టాలు తప్పలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 566 పాయింట్లు కోల్పోయింది. దీనితో 59,610 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 17,798 వద్దకు దిగొచ్చింది.


విలీన ప్రకటన తర్వాత హెచ్​డీఎఫ్​సీ జంట షేర్లలో రెండో రోజూ భారీగా లాభాల స్వీకరణ నమోదైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ రెండు సంస్థలే అత్యధిక నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల పవనాలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. లోహ ఎఫ్​ఎంసీజీ షేర్లు కాస్త సానుకూలంగా స్పందించాయి.


సూచీల కదలికలు ఇలా..


ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,941 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది.   59,509 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 17,901 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 17,779 స్థాయిని కూడా చేరింది.


నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..


ఎన్​టీపీసీ 2.61 శాతం, టాటా స్టీల్​ 1.94 శాతం, పవర్​గ్రిడ్​ 1.52 శాతం, నెస్లే ఇండియా 1.10 శాతం లాభాలను గడించాయి.


హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 3.51 శాతం, హెచ్​డీఎఫ్​సీ 3.26 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 2.07 శాతం, టెక్ మహీంద్రా 1.67 శాతం నష్టాలతో సెషన్​ను ముగించాయి.


Also read: Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్​ కోసం కస్టమర్ల తిప్పలు


Also read: HDFC merge: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​-హెచ్​డీఎఫ్​సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook