Srikalahasti Road Accident News: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా మిట్టకండ్రిగ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా విజయవాడ వాసులుగా గుర్తించారు. గాయపడిని వ్యక్తిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడకు చెందిన ఏడుగురు ఇన్నోవా వాహనంలో తిరుమలకు వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద టీ తాగుదామనే క్రమంలో లారీ ఇన్నోవాను ఢీకొట్టింది. ఆరుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో రక్తసిక్తమవ్వగా.. ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.  


Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook