Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చెరువు దగ్గరకు వెళ్లారు. ఈక్రమంలోనే ఈత కొడుతూ ప్రమాదవశాత్తు చెరువులో నీటి మునిగి మృతి చెందారు. మృతులు అబ్దుల్ రహీం కుటుంబానికి చెందిన వారిగా తేల్చారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఓ బాలిక ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులంతా 12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను చెరువుల దగ్గరకు పంపాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. 


Also read:Indonesia Soccer Tragedy: ఇండోనేషియా స్టేడియంలో తొక్కిసలాట..174కి చేరిన మృతుల సంఖ్య..!


Also read:ICC T20 WC 2022: అతడు లేకపోతే టీమిండియాకు కష్టమే..ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి