Mother Kills Own Child for Extra Marital Affair: ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ క్రైమ్ చూసినా అందులో అంతర్లీనంగా వివాహేతర సంబంధమే దానికి కారణంగా తేలుతోంది. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా చేటు తెస్తాయని తెలిసి కూడా క్షణిక ఆనందం కోసం అడ్డదారులు తొక్కుతున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. తాజాగా వైఎస్ఆర్ జిల్లా బద్వేలు రూపారం పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడుతో కలిసి కన్న కుమారుడిని ఒక తల్లి హత్య చేసి మాతృత్వానికే మాయని మచ్చగా మిగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గ్రామానికి చెందిన మారుతి నాయక్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను 14 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన కవిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే వృత్తి రీత్యా వీరు కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇప్పుడు ఖాజీపేటలోని చెమ్మళ్ళపల్లె అనే గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.


లారీ డ్రైవర్ గా పనిచేసే మారుతీ నాయక్ లారీ డ్రైవర్ గానే పనిచేస్తున్న వినోద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో మారుతీ నాయక్తో ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారడంతో మారుతీ నాయక్ ఇంటికి వినోద్ రాకపోకలు బాగా పెంచాడు. ఈ నేపద్యంలోనే వినోద్ కు కవితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మూడు నెలల క్రితం వినోద్ కవితలు నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయారు.


కొద్దిరోజుల పాటు అక్కడక్కడ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ వచ్చిన ఈ జంట మూడు నెలల క్రితం బద్వేలు రూపారంపేటలో ఒక ఇంటిని అద్దెకి తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య కనిపించడం లేదని ఇద్దరు పిల్లలు కూడా మిస్ అయ్యారని చెబుతూ మారుతి నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి వారు బద్వేలలో ఉన్నట్లు సమాచారం అందుకున్న మారుతి నాయక్ తన సోదరితో కలిసి వెళ్లి కవితను ఈ విషయం మీద ప్రశ్నించాడు.


ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్ వారిని చూసి పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది కదా కుమారుడు ఎక్కడ అని భార్యను మారుతీ నాయక్ ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పలేకపోయింది, దీంతో బద్వేల్ పోలీస్ స్టేషన్లో మారుతీ నాయక్ ఫిర్యాదు చేశాడు.


అతని ఫిర్యాదు మేర మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా 15 రోజుల కిందట రాత్రి సమయంలో బాలుడు ఎక్కువగా ఏడుస్తున్నాడని వినోద్ తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు కవిత చెప్పుకొచ్చింది. తాము ఇద్దరం కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే ఒక ఖాళీ స్థలంలో గొయ్యితవి పూడ్చామని వెల్లడించించడంతో ఒక్క సారిగా పోలీసులు షాకయ్యారు. దీంతో పోలీసులు వారు చెప్పిన చోట బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు తవ్వకాలు మొదలుపెట్టారు. 


Also Read: Ys Jagan on Pawan Kalyan:ఈ భార్య కాకపోతే ఆ భార్య..రాష్ట్రానికి ఇదేం ఖర్మ రా.. పవన్ పై జగన్ పరోక్ష విమర్శలు


Also Read: Metro Rail Time Extended: హైదరాబాద్ మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి రెండింటిదాకా మెట్రో రైలు సర్వీసులు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook