Kadapa Constable Family Death: కడప నగరంలో దారుణం చోటుచేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో తన ఇద్దరు ఆడపిల్లలను తన భార్యను కాల్చి అనంతరం తాను అదే రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆస్తి తగాదాల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు విదుల్లో ఉన్నాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు. ఈ ఘటన అర్థరాత్రి సమయంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే ఈ ఘటనకి గల కారణాలు వెలువడే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించిన ఇంటికి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్పీ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని చేరుకుని.. మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Eng Vs NZ Match Upadates: నేడే విశ్వకప్ ఆరంభం.. తొలి మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు షాక్


Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook