Mercedes Car Fire: ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన ఆ ఘటన సంచలనం రేపుతోంది. చేసిన పనికి డబ్బులివ్వనందుకు యజమాని మెర్సిడెస్ కారును తగలబెట్టేశాడు ఆ వ్యక్తి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ నోయిడాలోని మేంపూర్ లో జరిగిన ఘటన సంచలనం కల్గిస్తోంది. డబ్బులివ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి..యజమానికి చెందిన మెర్సిడెజ్ కారుకు నిప్పంటించేశాడు. ఇవాళ వెలుగుచూసిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఖరీదైన మెర్సిడెజ్ కారుకు ఓ వ్యక్తి నిప్పంటిస్తూ కన్పిస్తాడు. 


ఈ ఘటన వెనుక ఏం జరిగిందనేది స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం చేసిన పనికి యజమాని డబ్బులు ఇవ్వలేదట. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి అతని లగ్జరీ కారుకు నిప్పంటించేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవడంతో సంచలనంగా మారింది.



నోయిడా సెక్టార్ 39 ప్రాంతంలోని సదర్‌పూర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. చేసిన పనికి పూర్తి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఆ వ్యక్తి ఇలా చేసినట్టు నోయిడా పోలీసులు తెలిపారు. 


Also read: Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వదలని వాన.. గోదావరి ఉగ్రరూపంతో హై అలర్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook