Shadnagar Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. జేపీ దర్గా నుంచి షాద్‌నగర్‌కు బైక్‌పై వెళుతున్న యువకుడు.. దూసకల్ వెళ్లే రోడ్డు మూలమలుపు ఉండడంతో గమనించలేకపోయాడు. దీంతో అతివేగంగా వెళ్తూ.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదం జరగ్గానే కారులోని రెండు బెలూన్లు తెరచుకోవడంతో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మహేశ్వరానికి చెందిన ఫర్జాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?  


Also Read: MI Vs RR Highlights: రోహిత్ శర్మకు అన్యాయం.. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook