Raj Tarun Case: తనపై ప్రియురాలు లావణ్య ఫిర్యాదుపై యువ హీరో రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఆమె ఆరోపణలను తిప్పికొట్టారు. ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని.. ఆమెకు డబ్బు మాత్రమే కావాలని ఆరోపణలు ఇచ్చారు. ఆమె వేరేకరితో లైంగిక సంబంధం ఉందని చెప్పి సంచలనం రేపారు. డబ్బులు ఇవ్వకపోతుండడంతో లావణ్య పోలీసులను ఫిర్యాదు చేసిందని చెప్పారు. మాల్వీ మల్హొత్రాతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మంచి స్నేహితురాలని పేర్కొన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raj Tarun: బిగ్‌ బ్రేకింగ్‌.. యువ హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి సంచలన ఆరోపణలు


 


తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని రాజ్‌ తరుణ్‌పై ఆయన ప్రియురాలు లావణ్య నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజ్‌ తరుణ్‌ స్పందించారు. ఈ సందర్భంగా లావణ్యపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. నా పరువు పోతుందనే ఉద్దేశంతో లావణ్య విషయాలు చెప్పలేదు. కేసులు, మీడియా వంటివి నచ్చక నేను దూరం పెట్టానని తెలిపారు. ఆమె డబ్బుల కోసమే ఇదంతా చేస్తోందని చెప్పారు. లావణ్యకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో సంబంధం ఉందని పేర్కొన్నారు.

Also Read: Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఓజీపై అప్‌డేట్‌ ఇచ్చిన పవన్‌ కల్యాణ్


 


'లావణ్య డ్రగ్స్‌ వాడడం మొదలుపెట్టింది. ఆమెపై కేసు కూడా నమోదై రెండు నెలలు జైలుకు వెళ్లి వచ్చింది. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నా. నా ఇంట్లోనే ఉంది. లావణ్యకు డబ్బులు మాత్రమే కావాలి. ఇంట్లో నుంచే వెళ్లగొట్టేస్తాననే భయంతో లావణ్య ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజంగా నేను కావాలంటే మస్తాన్‌ సాయి తనను పెళ్లి చేసుకుంటానని గుంటూరులో లావణ్య ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్‌ తరుణ్‌ ప్రశ్నించారు. నా పరువు పోగొట్టాలని.. డబ్బుల కోసం లావణ్య కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు.


మస్తాన్ సాయితో సంబంధం?
'నేను ఉంటున్న నివాసంపైనే లావణ్యతో మస్తాన్‌ సాయితో రిలేషన్‌ నడిపింది. లావణ్యపై డ్రగ్స్‌ కేసు ఉంది. మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో సంబంధం ఉంది. అద్దాల మేడ మీద ఉన్నవాళ్లు రాళ్లు విసిరితే అద్దాలే పగులుతాయి. ఒకప్పుడు లావణ్య నాకు ఎంతో సహాయం చేసింది. ఆ కృతజ్ఞతతోనే ఇన్నాళ్లు ఓపిక పట్టాను. 2017 వరకు ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నా. ఆమె, ఆమె స్నేహితుల సంస్కృతి వేరు. నేను పక్కా ఆధారాలతో వస్తా. లావణ్య భండారం బయట పెడుతా' అని రాజ్‌ తరుణ్‌ వివరించారు.


పరిచయం ఎలా?
'షార్ట్‌ ఫిలిమ్స్‌ చేస్తున్న సమయంలో లావణ్య ఫేసుబుక్‌లో పరిచయమైంది. హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో పరిచయమై ఆ తర్వాత నాకు వసతి సౌకర్యం కల్పించింది. ఉయ్యాల జంపాల సినిమా తర్వాత మేం రిలేషన్‌లో ఉన్నాం. నేను జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోను అని చెప్పా. ఫిర్యాదు చేయకముందే రూ.20 వేలు అడిగింది. డబ్బులు ఇవ్వనని చెప్పిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేవలం డబ్బుల కోసమే లావణ్య ఇలా చేస్తుంది. మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. మిగతా రెండూ ఉన్నాయి' అని రాజ్‌ తరుణ్‌ తెలిపారు. 


'లావణ్యకు చాలా కోపం. ఆ కోపంలో ఏం చేస్తుందో తెలియదు. కోపంలో ఎన్నో ఫోన్లు, టీవీలు, ఐప్యాడ్‌లు వంటివి పగులగొట్టింది. కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నా. లావణ్య ఫిర్యాదుకు ప్రతిగా నేను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా. లావణ్య చేస్తున్నది పద్ధతి కాదు. ఆమెకు పంపిన డబ్బులు స్టేట్‌మెంట్లు కూడా చూపిస్తా' అని రాజ్‌ తరుణ్‌ వివరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter