ముంబై: కొన్ని రోజుల కిందట బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కరోనా మహమ్మారి బారిన పడింది. ఈ క్రమంలో చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) సోమవారం మధ్యాహ్నం ఇంటికి ఆరోగ్యంగా వెళ్లారు. తమ కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలంటూ అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు చూపిన ప్రేమ పట్ల ఐశ్వర్యరాయ్ ధన్యవాదాలు (Aishwarya Rai Thank You Message) తెలిపింది. COVID19: హాస్పిటల్ నుంచి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య డిశ్ఛార్జ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బచ్చన్ ఫ్యామిలీకి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆరాధ్య బచ్చన్, తన చేతులు ... ఒకరు ప్రేమను చూపిస్తే.. మరొకరు ధన్యవాదాలు తెలిపేలా నమస్కరిస్తున్న ఫొటోను ఐశ్వర్యరాయ్ షేర్ చేశారు. మీకు జాగ్రత్తగా ఉండాలి, అందరికీ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. లవ్ యు ఆల్ అని పోస్టులో ఐష్ రాసుకొచ్చింది. Amitabh Bachan: కోవిడ్-19 నెగెటీవ్ రిపోర్ట్‌పై అమితాబ్ ఆగ్రహం



తొలుత ఇంట్లోనే హోం ఐసోలేషన్‌తో ఉన్న ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan), ఆరాధ్య బచ్చన్‌లు లక్షణాలు అధికం అవుతున్న నేపథ్యంలో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా కోవిడ్19 టెస్టుల్లో నెగటివ్ రావడంతో ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలను సోమవారం (జులై 27న) డాక్టర్లు డిశ్ఛార్జ్ చేయగా  తమ నివాసానికి (Jalsa) తిరిగొచ్చారు. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే..


కాగా, అమితాబ్, అభిషేక్ ఇంకా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జులై 11నుంచి వీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి నివాసం కంటైన్‌మెంట్ జోన్‌గా ముంబై అధికారులు కొనసాగిస్తున్నారు. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు