Anasuya Goodbye to Jabardasth show: యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ తెచ్చుకుంది అనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కేవలం అనసూయ భరద్వాజ్ కోసమే జబర్దస్త్ షో చూసేవాళ్ళు ఉన్నారు అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు ట్రెండ్లో ఉంటూ ఒకపక్క బుల్లితెరలో అలరిస్తూనే మరోపక్క సినీ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన జబర్దస్త్ షోకి ఆమె గుడ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది అనే ప్రచారం ఊపందుకుంది. దానికి కారణం ఆమె పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంతం అనే సినిమాలో అనుకోకుండా చిన్న పాత్ర చేసి సినీరంగ ప్రవేశం చేసింది అనసూయ. తన కాలేజీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ఫేస్ నచ్చడంతో దర్శకుడు ఆమెను ఒక చిన్న సీన్ లో కనిపించేలా చేశారు. ఆ తర్వాత తన కాలేజీ చదువు పూర్తి చేసుకుని ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించింది అనసూయ. తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారాలని ఉద్దేశంతో మల్లెమాల సంస్థకు చెందిన జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షో ఆమె జీవితాన్ని మార్చేసింది అని చెప్పచ్చు. జబర్దస్త్ ముందు జబర్దస్త్ తర్వాత అనిపించే విధంగా ఆమె లైఫ్ మారిపోయింది. షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయకు సుకుమార్ రూపంలో సినీరంగ ప్రవేశం చేసేందుకు అద్భుతమైన అవకాశం దక్కింది. 


రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్ర చేసి అనసూయ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. భర్త చనిపోయిన విషయాన్ని దాచి తన భర్త దుబాయ్ లోనే ఉన్నాడని ఊరి ప్రజలందరినీ నమ్మిస్తూ ఆ బాధతో తనలో తానే కుమిలిపోతూ మహిళ పాత్రలో అనసూయ నటన తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చింది. దీంతో అనసూయకు అనేక సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. అయితే అన్ని పాత్రలు ఒప్పుకోకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు వెళుతుంది అనసూయ. 


అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మొదటి భాగంలో కూడా అనసూయ ఒక మంచి పాత్ర చేసింది. దాక్షాయిని అనే పాత్రలో నటించిన అనసూయ తన నటన విశ్వరూపాన్ని చూపించింది. ఈ సినిమా తరువాత అనసూయకు వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ ఆమె జబర్దస్త్ షూటింగ్ కూడా చేయాల్సి రావడంతో ఈ రెండింటిని మేనేజ్ చేయడం కష్టమవుతుందట. దీంతో ఎలా అయినా సినిమాల్లో రాణించాలనే కోరికతో ఉన్న అనసూయ ఇన్నాళ్లు తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ ను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 


ఇక ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ షేర్ చేసింది. జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఎన్నో మధుర అనుభూతులు, కొన్ని చేదు అనుభవాలు, మరికొన్ని ఇబ్బందికర పరిస్థితులు అన్నీ కలిపి తనకు మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ గుర్తుకు వస్తున్నాయని ఆమె పేర్కొంది. జీవితం తనకోసం రెడీగా ఉంచిన వాటిని ఫేస్ చేయడం కోసం వెళ్ళక తప్పడం లేదని ఆమె పేర్కొన్నారు. తనను ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో, భవిష్యత్తులో కూడా అలాగే ఆదరిస్తారని భావిస్తున్నానని ఆమె తన ఎమోషనల్ నోట్లో పేర్కొంది. ఎక్కడా కూడా అనసూయ తాను జబర్దస్త్ వదిలి వెళుతున్నాను అని పేర్కొనలేదు కానీ ఇంత మెసేజ్ పెట్టి బాధపడుతోంది అంటే ఇలాంటి పెద్ద విషయం ఏదో జరిగే ఉంటుందని అంటున్నారు నెటిజనులు. నిజా నిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.


Also Read: Rekha Boj: సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ నో* ఏం పెట్టుకున్నారు?.. హీరోయిన్ రేఖ వివాదాస్పద వ్యాఖ్యలు


Also Read: Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook