Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!

Jr Ntr Phone Call to Fan's Mother: తనకు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అతని కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడడమే కాక కోమాలో ఉన్న అతనికి ధైర్యం చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 10:20 AM IST
  • కోమాలో ఎన్టీఆర్ అభిమాని
  • అతని తల్లికి కాల్ చేసి అభయం ఇచ్చిన ఎన్టీఆర్
  • కోమాలో ఉన్న అభిమనితో మాట్లాడితే వేళ్లు కదిలించిన వైనం
Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!

Jr Ntr Phone Call to Fan's Mother: కొంతమంది సినీ హీరోల మీద పెంచుకునే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న హీరోలకు ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉంటారు. కేవలం తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు తమిళ,  కన్నడ,  మలయాళ పరిశ్రమల్లో కూడా హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా తనకు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అతని కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడడమే కాక కోమాలో ఉన్న అతనికి ధైర్యం చెప్పాడు. అధైర్య పడకుండా దేవుడిని నమ్మి ప్రార్ధించాలని మళ్ళీ మన మధ్యకు తిరిగి వస్తాడని ధైర్యం చెప్పారు.
 
ఏపీలో రాయలసీమ జిల్లాలకు చెందిన జనార్ధన్ అనే వ్యక్తి ప్రస్తుతం అనారోగ్యం పాలయ్యాడు. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన జనార్ధన్ ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అయితే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అభిమాని కుటుంబ సభ్యులతో మాట్లాడతానని అన్నారు. అందులో భాగంగానే జనార్ధన్ తల్లితో మాట్లాడుతూ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. దేవుడిని నమ్మి ప్రార్థించాలని,  కచ్చితంగా జనార్ధన్ మళ్లీ మన మధ్యకు వస్తాడని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. జనార్ధన్ తల్లితో మాట్లాడిన తర్వాత కోమాలో ఉన్న జనార్ధన్ దగ్గర ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫోన్ పెట్టారు.
 
ఈ సమయంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ జనార్ధన్ కి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఉన్నాను,  నువ్వు త్వరగా కోలుకుంటే మనం కలుద్దామంటూ అతనికి జీవితం మీద ఆశ కల్పించే ప్రయత్నం చేశారు. మేము అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము,  త్వరగా నిన్ను చూడాలని ఉంది,  వచ్చెయ్ నీకోసం ప్రార్థిస్తున్నా నీకోసం నేనున్నాను,  మన అభిమానులు ఉన్నారు అంటూ ఎన్టీఆర్ జనార్ధన్ తో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మన అభిమానులందరూ నీ మంచి కోరుతున్నారు,  నువ్వు కోలుకుని త్వరలోనే కోలుకుని రా కలుద్దాం నీకేం కాదు అంటూ కోమాలో ఉన్న పేషెంట్ కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. 

ఇక ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో జనార్ధన్ వీళ్ళు వదిలేస్తున్నారని,  ఎన్టీఆర్ అంటే అంతలా జనార్ధన్ అభిమానిస్తున్నాడని,  అని అక్కడున్న వారు పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు దానికి జనార్ధన్ తల్లి స్పందించిన తీరుకు ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అవుతున్నారు.ఇక ఎన్టీఆర్ మాట్లాడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అందులో ఆయన మాట్లాడిన నెంబర్ వైరల్ అవుతోంది. ఆయన నెంబర్ అనుకుని వరుసగా ఫోన్లు చేస్తున్నారట అభిమానులు. కానీ అది ఎన్టీఆర్ నెంబర్ కాదు,  ఎన్టీఆర్ ఆర్ట్స్ లో పనిచేసే వంశీ అనే వ్యక్తిది అని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

Also Read:Ramya Raghupathi: పవిత్ర వచ్చాకే మాకు గొడవలు.. మగాడివయితే అలా చేయమంటూ నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి సవాల్

Also Read: Pavitra Lokesh: నరేష్ తో సహజీవనం.. కృష్ణతో కలిసే.. మొదటి పెళ్లిపై పవిత్ర లోకేష్ సంచలనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News