Bigg Boss 7 Telugu latest Promo: బిగ్ బాస్ ఇంటి నెక్ట్స్ కెప్టెన్ కోసం కంటెస్టెంట్స్ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి ఎంపికయ్యారు. అయితే ఈ ఐదుగురిలో తదుపరి కెప్టెన్ ఎంపిక చేసే బాధ్యతను హౌస్ మేట్స్ కు అప్పగించారు బిగ్ బాస్. సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మిర్చి చాలా హాట్ అంటూ కెప్టెన్ ను ఎంపిక చేసే టాస్క్ నిర్వహించారు. పల్లవి ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ, ప్రియాంకల్లో ఎవరు కెప్టెన్సీకి సరిపోరని అనుకుంటే వారి మెడలో మిరపకాయల దండ వేయాలని మిగిలిన కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోమో ఓపెన్ చేస్తే.. మెుదటగా అమర్.. పల్లవి ప్రశాంత్ ను సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా కంటెండర్లుగా ఉన్నవారందరూ నామినేషన్లలో ఉన్నారని అమర్ చెబుతాడు. అయితే తనకు దండ వేస్తే మిగిలిన కంటెస్టెంట్లు సేఫ్ అవుతారా అని ఈ సీరియల్ హీరోను ప్రశ్నిస్తాడు రైతు బిడ్డ. అయినా సరే ప్రశాంత్‍కే దండ వేస్తాడు అమర్. ఆ తర్వాత ప్రియాంకకు భోలే షావలి దండ వేశాడు. వీరిద్దరి మధ్య కూడా కాస్తా వాగ్వాదం చోటుచేసుకుంటుంది. 



అనంతరం శోభకు రతిక దండ వేసి.. పద్దతి మార్చుకోవాలని చెబుతోంది. వేరే వాళ్లకు ప్రాబ్లెమ్ అనిపిస్తే వారే చెబుతారని ఈ సందర్భంగా మోనిత చెప్తోంది. ప్రశాంత్ కే తేజ కూడా దండ వేస్తాడు. ఆ తర్వాత మిర్చి దండను వేసేందుకు శోభను సెలెక్ట్ చేసుకుంటాడు యావర్. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వీరిద్దరి మధ్య మాటామాటా పెరుగుతుంది. ఈ క్రమంలో యావర్ ను పిచ్చోడంటూ విరుచుకుపడుతుంది శోభా.  అదే సమయంలో దండను నేలకేసి కొడతాడు యావర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. 



Also Read: HBD David Warner: డేవిడ్ వార్నర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.