Shahrukh Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో గడిపారు. చిత్రం విడుదల సందర్భంగా మొత్తం యూనిట్ శ్రీవారిని సందర్శించుకున్న వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుమల వెంకటేశ్వరస్వామిని సందర్శించుకుంది. ఇందులో నటుడు షారుఖ్ ఖాన్, నటి నయనతార, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తదితరులు ఇవాళ ఉదయం తిరుమల సందర్శించి ఉదయం వేళ జరిగే సుప్రభాత సేవలో గడిపారు. శ్రీవారిని దర్శించుకుని బయటికొస్తూ ధ్వజ స్థంభానికి తల ఆన్చి ప్రార్ధనలు చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. 


ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానున్న జవాన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే జవాన్ అడ్వాన్స్ టిక్కెట్లు 3 లక్షలకుపైగా విక్రయమయ్యాయి. షారుఖ్ ఖాన్ తిరుమలను సందర్శించడం ఇదే తొలిసారి. పఠాన్ సినిమా తరువాత అంతకుమించిన అంచనాలు జవాన్ సినిమాపై ఉన్నాయి. గత వారం వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. 


Also read: Meenakshi Chaudhary: ఎద అందాలతో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి.. కుర్రకారు ఫ్యూజులు ఔట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook