Who is Barkha Madan: ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో  ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీపడి..తృటిలో టైటిల్ ను చేజార్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అంతంటి స్టార్ డమ్ వదులుకుని ఉన్నట్టుండి బౌద్ద సన్యాసిగా మారింది బర్ఖా మదన్. ఆమె అలా మారడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1994లో మిస్ ఇండియా ఇండియా పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది బర్ఖా మదన్.  మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 1996లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2003లో ఆర్జీవీ తెరకెక్కించిన  ‘భూత్’ సినిమాలో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి నటించింది. 


Also Read: Yami Gautam pregnancy: తల్లి కాబోతున్న యామీ గౌతమ్.. ఫ్రూవ్ ఇదిగో..!


మూవీ అవకాశాలు తగ్గడంతో.. సీరియల్స్ వైపు మెుగ్గు చూపింది. 1857 క్రాంతితో సహా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన రాణిలక్ష్మీబాయి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ జీ టీవీ షో సాత్ ఫేరే – సలోని కా సఫర్‌లో కూడా కనిపించింది. అంతేకాకుండా ఈమె నిర్మాతగా మారి సోచ్ లో, సుర్ఖాబ్ అనే రెండు చిత్రాలను నిర్మించింది. అంతేకాకుండా ఇందులో నటించింది కూడా. రీసెంట్ గా ఈమె బౌద్ద మతాన్ని స్వీకరించింది. అంతేకాకుండా తన పేరును  ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా మార్చుకుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం గబర్ఖా మదన్ పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతూ కనిపిస్తున్న నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 


Also Read: Disha Patani: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన లోఫర్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter