టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం తెలుగు వారిని ఆకర్షిస్తోంది. ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంత రావు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే గుండు హన్మంత రావు అకాల మరణంతో అతడి ఏకైక కుమారుడు ఆదిత్య ఆ ఇంట్లో ఎవ్వరూ లేని అనాధగా ఒంటరిగా మిగిలిపోయాడు. గతంలోనే ఆదిత్య తల్లి, సోదరి మృతి చెందడం, ఇటీవల తనకి మిగిలిన పెద్ద దిక్కైన తండ్రి కూడా అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆదిత్య ఎవ్వరూ లేని ఒంటరి వాడయ్యాడు.


తన మరణానంతరం ఆదిత్య ఒంటరి వాడవుతాడని ముందే గ్రహించిన గుండు హన్మంత రావు.. తన ఆప్తమిత్రుడైన బ్రహ్మానందంను ఆదిత్య బాధ్యతలు చూసుకోవాల్సిందిగా కోరారట. ఆదిత్య దుస్థితి చూసి చలించిపోయిన బ్రహ్మానందం తన మిత్రుడు కోరిన విధంగానే ఆదిత్యకు ఓ ఉద్యోగం చూపించి, అతడికి పెళ్లి చేసే బాధ్యతలు తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మానందం నిండు మనసు నిజంగానే ఎంత గొప్పదో కదా!