Trisha: రోనా మహమ్మారి తీవ్రమవుతోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల్ని కరోనా వెంటాడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైపోయిందనే సంకేతాలు వెలువడ్డాయి. రోజువారీ కేసులు ఒక్కసారిగా లక్ష దాటేశాయి. పరిస్థితి మళ్లీ విషమిస్తోంది. మరోవైపు కరోనా మహమ్మారి సెలెబ్రిటీల్ని చుట్టుముడుతోంది. మొన్న అమితాబ్ బచ్చన్, నిన్న మహేశ్ బాబు, మీనా కుటుంబాలతో పాటు మంచు మనోజ్, లక్ష్మి, చియాన్ విక్రమ్, తమన్ , కమల్ హాసన్, వడివేలులు కరోనా బారిన పడగా..నేడు సినీ నటి త్రిషను కరోనా మహమ్మారి పలకరించింది. మరోవైపు బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఓ వైపు వివిధ రకాల ఈవెంట్లు లేదా ప్రారంభోత్సవాల్లో పాల్గొనడమే కాకుండా షూటింగుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా సంక్రమణ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. 


తాజాగా ప్రముఖ హీరోయిన్ త్రిషకు (Trisha) కరోనా సాకింది. చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే కొన్ని క్షణాల ముందు ఈ మహమ్మారి సోకినట్టు నిర్ధారణైందని త్రిష వెల్లడించింది. మీకు తెలిసిన అన్ని కరోనా లక్షణాలు తనలో ఉన్నాయని..చాలా బాధ కలిగిందని తెలిపింది. ప్రస్తుతానికి త్రిష కోలుకుంటున్నట్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ (Corona Vaccination) అయినందునే తనకిప్పుడు పరిస్థితి మెరుగైందని..అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. త్వరలోనే కోవిడ్ పరీక్ష మరోసారి చేయించుకుని అప్పుడు ఇంటికి వస్తానంది. తన కోసం ప్రార్ధించిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపింది. 


Also read: Nidhi Aggarwal: మొన్న నయనతార, త్రిష..ఇప్పుడు నిధి అగర్వాల్..త్వరలో పెళ్లి కూడా అట