Celebrity Couple Marriage: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు చూపులు కలిసిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది జీవితాంతం తమ వివాహా బంధాన్ని కొనసాగించారు. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అపర్ణా దాస్, హీరో దీపక్ పరంబోల్ ఎట్టకేలకు ఒకింటివారు కాబోతున్నారు. ఈ నెల 24న కేరళలోని పడకంచేరిలో వీరిద్దరి వివాహాం గ్రాండ్‌గా జరగనున్నట్టు సమాచారం. ఇక వీళ్లిద్దరు 'మనోహరం' సినిమాలో కలిసి తొలిసారి నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అపర్ణా దాస్ విషయానికొస్తే.. 2018లో నిజం ప్రకాషన్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'మనోహరం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. ఈమె తెలుగులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా నటించిన 'ఆదికేశవ'లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. అటు విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్‌'లో ఈమె కీలక పాత్ర పోషించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు దీపక్ పరంబోల్ విషయానికొస్తే.. 2010లో 'మలార్‌వాడి ఆర్ట్స్ క్లబ్' సినిమాతో పరిచయమయ్యాడు. ఇక 2012లో 'తత్తయన్ మరియాతు' సినిమా నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇతను వెనుదిరిగి చూసుకోలేదు. ఇక మమ్ముట్టితో ఇతను చేసిన 'కన్నూర్ స్క్వాడ్' మూవీ ఇతనికి మంచి పేరు తీసుకొచ్చింది.  తాజాగా 2024లో మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'మంజుమ్మేల్ బాయ్స్' మూవీతో పలకరించాడు. ఈ సినిమాతో ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా చిత్ర రంగంలో ప్రవేశించిన కొన్నేళ్లకే వీళ్లిద్దరు ఒకటి కాబోతుండటం విశేషం. ఇక కాబోయే దంపతులకు సినీ ప్రముఖులు, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.


[[{"fid":"306821","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


దీపక్ పరంబోల్ నటించిన 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమా విషయానికొస్తే.. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు మలయాళ భాషలోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డులకు ఎక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. మంజుమ్మేల్ అనే పట్టాణానికి కొంత మంది ఫ్రెండ్స్..కొడైకెనాల్‌కు ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ నిషేధం విధించిన ఓ గుహలో అనుకోకుండా ప్రవేశిస్తారు. ఆ గుహలో పడిపోయిన ఓ స్నేహితుడిని రక్షించడానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేసారు. ఈ ప్రయత్నంలో వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేదఇ ఈ సినిమాలో  ఎంతో థ్రిల్లింగ్‌గా చూపించారు.  ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్,ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి విడుదల చేస్తున్నారు. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాను తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను చిదంబరం దర్శకత్వం వహించారు.


Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్‌ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook