అనూహ్య పరిస్థితుల్లో చిక్కుల్లో పడ్డ కుటుంబసభ్యుల్ని రక్షించుకోడానికి ఓ వ్యక్తి పడిన తపన. సాక్ష్యాల్ని చెరిపేసి కావచ్చు కానీ కుటుంబం కోసం ఆ వ్యక్తి పడిన కష్టానికి దృశ్యరూపమే దృశ్యం సినిమా ( Drishyam movie ). నిజంగా జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రారంభమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగులో వెంకటేశ్ ( Venkatesh ), మీనా ( Meena ) కాంబినేషన్ లో ఆరేళ్ల క్రితం విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అనుకోకుండా ఓ హత్యకేసులో కుటుంబసభ్యులంటే..భార్య, కుమార్తె చిక్కుకోవడం, వారిని రక్షించడానికి ఇంటి యజమాని అంటే సినిమా హీరో పడిన ప్రయాస, కష్టం అంతా ఇంతా కాదు. పోలీసు కేసు నుంచి కుటుంబాన్ని తప్పించడానికి సాక్ష్యాల్ని సైతం చెరిపేసే ప్రయత్నం చేయడం చట్టానికి చిక్కకుండా అత్యంత పగడ్బందీగా వ్యవహరించడం పోలీసులకే మతిపోతుంది. వాస్తవానికి కేరళలో ( Real incident in kerala ) జరిగిన ఓ నిజమైన సంఘటనను మోహన్ లాల్, మీనా ప్రధానపాత్రలో తెరకెక్కించారు. ఇప్పుడు ఆరేళ్ల విరామం అనంతరం లాక్డౌన్ నిబంధనల మధ్య దృశ్యం సీక్వెల్ పార్ట్ టూ ( Drishyam part 2 ) షూటింగ్ ను డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రారంభించారు. దృశ్యం 2 లొకేషన్ వీడియోను హీరో మోహన్ లాల్ ( Mohan lal ) ట్విట్టర్ లో షేర్ చేశాడు. పూర్తిగా బ్లాక్ ఔట్ ఫిట్ లో కన్పిస్తున్న మోహన్ లాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. హిందీలో అజయ్ దేవ్ గన్, శ్రియ కాంబినేషన్ రీమేక్ భారీ విజయం సాధించింది. ఇప్పుడు దృశ్యం 2 మరెన్ని విజయాలు సాధిస్తుందో చూడాలి. Also read:Adipurush movie: ప్రభాస్ బర్త్ డే సర్‌ప్రైజ్ ఇదేనా ?