Jani Master Wife Sumalatha: జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొన్న వేళ అతడి భార్య సుమలత అలియాస్ అయేషా సంచలన ప్రకటన చేశారు. 'నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేశానని ఆమె నిరూపిస్తే జానీ మాస్టర్‌ను వదిలేస్తా' అని సవాల్‌ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jani Master: జానీ మాస్టర్ కి సర్ది చెప్పిన స్టార్ డైరెక్టర్.. వినకపోవడం వల్లే ఈ చిక్కంతా..!


లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌పై తెలంగాణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను తెలంగాణ పోలీసులు గోవాలో అరెస్ట్‌ చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు. త్వరలోనే తెలంగాణకు అతడిని తీసుకురాబోతున్నారు. అయితే తన భర్త అరెస్ట్‌పై హైదరాబాద్‌లోని నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జానీ మాస్టర్‌ భార్య సుమలత వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడకుండా ఆవేశంతో వెళ్లారు. అయితే తన నివాసంలో కొన్ని మీడియా చానళ్లతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Vijay Devarakonda: ‘వీడీ 12’మూవీ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..


స్టార్ డమ్ కోసమే
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని సుమలత అలియాస్‌ అయేషా వెనకేసుకొచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టిన జూనియర్‌ కొరియోగ్రాఫర్‌కు జానీ మాస్టర్‌ ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఫిర్యాదు చేసిన అమ్మాయి తన భర్త తప్పు చేశానని నిరూపిస్తే తాను తన భర్త జానీ మాస్టర్‌ను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. అమ్మాయి డబ్బులు.. పలుకుబడి కోసమే ఇలాంటి నీచానికి దిగిందని ఆమె వాపోయారు.


విలాసవంత జీవితం
'సినీ పరిశ్రమలో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆ అమ్మాయి ఆశపడుతోంది. అది ఆమె తల్లి కోరిక కూడా. స్టేజ్‌ షోల నుంచి వచ్చిన ఆమె సినీ పరిశ్రమ చూసి విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటోంది. తనకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని ఆరాట పడుతోంది' అని ఆయేషా ఆరోపణలు చేశారు. 'జానీ మాస్టర్‌తో ఆ అమ్మాయి సన్నిహితంగా ఉన్నది ఎవరైనా చూశారా?'అని ప్రశ్నించారు. 'ఇప్పటివరకు ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని కేసు పెట్టిన ఆమె మాట్లాడడానికి ఏమైంది?' అని నిలదీశారు.


కార్డు ఇచ్చారు
'ఆ అమ్మాయే గతంలో జానీ మాస్టర్‌ వద్ద పని చేయడం నా అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది? ఆమె మాట చెప్పిన సమయలో ఎలాంటి ఇబ్బంది పడలేదు' అని జానీ మాస్టర్‌ భార్య సుమలత వివరించారు. 'హైదరాబాద్‌లో అసోసియేషన్‌ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులు లేకపోతే ముంబైలో జానీ మాస్టర్‌ ఇప్పించారు. తాను పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా ఆ అమ్మాయికి జానీ మాస్టర్‌ అవకాశం (రన్నర్ సినిమా) ఇచ్చారు' అని సుమలత వెల్లడించారు.

నేను మతం మార్చుకోలే
తమపై 'లవ్‌ జిహాద్' అని చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 'నా పేరు సుమలత. మా యూనియన్‌ డ్యాన్సర్లు అందరూ సుమలత అని పిలుస్తారు. నేను అన్ని పూజలు చేస్తా. బతుకమ్మ ఆడుతాం. ఒక వైపు మాత్రమే చూసి అలా మాట్లాడడం సరికాదు' అని సుమలత కొట్టిపారేశారు. 'రాజకీయాల్లోకి వచ్చినందుకే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. భారీ ప్రణాళిక ప్రకారమే తన భర్తపై జరుగుతున్న పరిణామాలు' అని సుమలత అలియాస్‌ అయేషా పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.