Manchu Manoj: మంచు మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ఇకపై హీరోగా కాకుండా విలన్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే తేజ సజ్జ హీరోగా నటిస్తూన్న ‘మిరాయి’లో ప్రముఖ పాత్రలో నటిస్తున్న మంచు మనోజ్.. తాజాగా సాయి ధరమ్ తేజ్ కాదు కాదు.. సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంచు మనోజ్ హీరోగా సక్సెస్ కాకపోయినా.. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ హీరోగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.


ఈ సినిమాలో మంచు మనోజ్ క్యారెక్టర్ హీరోతో సరిసమానంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను రోహిత్ కే.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న మూడో షెడ్యూల్లో మంచు మనోజ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాను స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాలతో విలన్ గా మంచు మనోజ్ కెరీర్ గాడిన పడుతుందా అనేది చూడాలి.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter