టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘గాయత్రి’ అనే సినిమా రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో శ్రియతో కలిసి ఓ ఫోటో దిగారు విష్ణు. రావణాసురుడి పది తలల బొమ్మను తన తలకు తగిలించుకున్న విష్ణు.. నవ్వుతూ ఫోజులిస్తూ ఈ ఫోటోలో కనిపించడం విశేషం. ఆర్‌.మదన్ దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి  26, 2018 తేదీన విడుదల కానుందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో విష్ణుతో పాటు నిఖిలా విమల్, అనుసూయ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.