Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత శబరిమల ((Sabarimala) అయ్యప్ప స్వామిని దర్శించుకున్నానంటూ ఈ సందర్భంగా చిరు చెప్పుకొచ్చారు. అయితే ఫ్యాన్స్ తాకిడి, భక్తుల రద్దీ దృష్ట్యా డోలీలో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు మెగాస్టార్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అయ్యప్ప స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న డోలీ సోదరులకు నా హృదయాంజలి. ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలతో ప్రయాణం చేయడం మంచి అనుభూతిని ఇచ్చిందని' చిరు ట్వీట్ చేశారు.  



మాస పూజను పురస్కరించుకుని నేడు అయ్యప్ప స్వామి దేవస్థానం తెరిచారు. ఈ నెల 17వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ శబరిమల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మండల పూజ, మకరజ్యోతి సమయాల్లో శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ సమయంలో వీలుకాకపోవడంతో... ఇప్పుడు చిరంజీవి దంపతులు శబరిమల యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చిరంజీవి బోళా శంకర్, గాడ్ ఫాదర్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఆచార్య (Acharya Movie) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 


Also Read: Mohan Babu: ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై : మోహన్‌బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook