నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. మైత్రి మూవీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు చందు ముండేటి. ప్రస్తుతం  'సవ్యసాచి' హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. చైతూ సరసన బాలీవూడ్ నటి నిధి అగర్వాల్ నటిస్తోంది. మాధవన్ కూడా చిత్రంలో నటిస్తున్నారు.


ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ- " మాధవన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రెండో షెడ్యూలు జరుగుతోంది.  ఈ షెడ్యూల్ లో చైతూ, నిధి అగర్వాల్, ఆర్. మాధవన్ పాల్గొంటారు. ఆర్. మాధవన్ పాత్ర  తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేని విధంగా ఉండబోతుంది" అన్నారు. ఆర్. మాధవన్ మాట్లాడుతూ- "మైత్రి మూవీ పిక్చర్స్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. 'సవ్యసాచి' టీమ్ తో పనిచేయడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అందరం కలిసి ఒక ఔట్ స్టాండింగ్ మూవీ చేయబోతున్నాం" అన్నారు.