ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు హరినాధ్ తెరకెక్కిన నీవెవరో సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన ప్రముఖ రచయిత కోన వెంకట్ మరోసారి తన మార్క్ కామెడిని పండించడం ఖాయం అనిపిస్తోంది. కోన వెంకట్ స్వయంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో తాప్సీ పన్ను, గురు ఫేమ్ రితిక సింగ్, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 24న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.