నందమూరి బాలకృష్ణ  హీరోగా మరో సినిమా  ఓ సినిమా తెరకెక్కుతుంది. కె.ఎస్. రవి కుమార్ డైరక్షన లో తెరపైకి వస్తున్న ఈ మూవీ సంబంధించిన  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నటాషా దోస్తీ ముఖ్యపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం మరో హీరోయిన్ ని తీసుకున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ సంబంధించిన కథలో వచ్చే ఓ ఇంపార్టెంట్ రోల్ కి లేటెస్ట్ గా మేకర్స్ రెజినా కాసాండ్రా ను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రెజెంట్ ఈ వార్తపై యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.


ఈ వార్త నిజమైతే కనుక ప్రస్తుతం యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న రెజీనా కు ఇది బంపర్ అఫర్ తగిలినట్టే. సి.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.