'భాగమతి' తర్వాత . .   అనుష్క నటిస్తున్న మరో చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి 'భాగమతి' తర్వాత అనుష్క శెట్టి ..  చాలా గ్యాప్ తీసుకుంది.  ఇప్పుడు 'నిశ్శబ్దం'తో మళ్లీ తెలుగు తెరుపై అలరించేందుకు సిద్ధమైంది అనుష్క.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్ రిలీజైంది. దాదాపు 2 నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రెయిలర్ ను ఈ రోజు (శుక్రవారం ) రిలిజ్ చేశారు.  ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కతోపాటు అంజలి కూడా నటిస్తోంది. సుబ్బరాజు, మాధవన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వరుసగా జరుగుతున్న హత్యలకు సంబంధించి కథ అల్లినట్లుగా తెలుస్తోంది.



Read Also : పెగ్గు తాగితే కరోనా వైరస్ రాదా..?


ఓ ఫామ్ హౌజ్ లో వరుసగా జరుగుతున్న హత్యల వెనుక ఓ దెయ్యం ఉందని అంతా  భావిస్తారు. నిజానికి ఏమైంది..? హత్యలు చేస్తున్నది ఎవరు..? దీని వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించడమే సినిమా పూర్తి కథనంగా తెలుస్తోంది. ఈ సినిమాకు హేమంత్ మధుకర్  దర్శకత్వం వహిస్తున్నారు.  అనుష్క క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ చేయకుండా ట్రెయిలర్ కట్ చేయడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..