Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన. అనతి కాలంలోనూ సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు పెద్ద హీరోల పక్కన చేస్తూ..తన గ్రాఫ్ ను అమాంతం పెంచుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ శాండిల్ వుడ్ (Sandalwood) బ్యూటీ తాజాగా అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ మీరు ఒకవేళ ఏదైనా బయోపిక్‌(Biopic)లో నటించాలనుకుంటే ఎవరి బయోపిక్‌లో నటిస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. తనకు సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తే అందులో తను నటిస్తాను అంటూ సమాధానమిచ్చింది. 


అభినవ సావిత్రి...మన సౌందర్య
గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సౌందర్య(Soundarya) బయోపిక్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈమెకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. నిన్నటి తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. స్వతహాగా కన్నడీగురాలైన సౌందర్య బయోపిక్‌లో మరో కన్నడ బ్యూటీ రష్మిక(Rashmika Mandanna) నటిస్తే బాగానే ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Actress Social Media Looks: అల్లు అర్జున్ గురించి ఒక్కమాటలో ఏం చెప్పగలనన్న Rashmika, మేఘా ఆకాశ్‌ సెలబ్రేషన్స్.. బ్లాక్ శారీలో బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌.. సోషల్‌మీడియాలో తారల హంగామా


ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న నన్ను సౌందర్య గారిలా ఉంటావని తరుచూ చెబుతూ ఉండేవారు. ఇక సౌందర్య యాక్టింగ్, సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని రష్మిక పేర్కొన్నారు. రష్మిక మందన్న తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.


ఈ యేడాది కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్(Sultan)’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు.. ఇపుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్‌(Bollywood)లో టాప్ టక్కర్ అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు అమితాబ్ బచ్చన్‌(Amitabh Bachchan‌‌)‌తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ(Pushpa)’లో కథానాయికగా నటిస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook