చియాన్ విక్రమ్ కొత్త సినిమా ట్రైలర్‌కి భారీ స్పందన కనిపిస్తోంది. రిలీజైన రెండు రోజుల్లోనే ఈ ట్రైలర్ 2.74 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తమిళంలో రూపొంది, తెలుగులో రిలీజవుతున్న డబ్బింగ్ సినిమా ట్రైలర్‌కి ఈతరహాలో స్పందన కనిపించడం చాలా అరుదే. 2003లో విక్రమ్ హీరోగా రిలీజైన స్వామి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ జంటగా నటించింది. ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన హరి దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా రూపొందగా.. విక్రమ్ చెప్పిన యాక్షన్, ఎమోషనల్ డైలాగ్స్‌లో హరి డైరెక్షన్ మార్క్ కనిపిస్తోంది. గతంలో మొదటి భాగం సినిమాకు హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఈసారి దేవీశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో మేజిక్ చేశాడని ట్రైలర్‌లో ఉన్న ఆర్ఆర్ వింటే స్పష్టమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇక హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మల్లన్న సినిమాలో సీబీఐ ఆఫీసర్‌గా తన విశ్వరూపం చూపించిన విక్రమ్ ఈసారి ఓ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. సినిమాలో విక్రమ్ హై ఓల్టేజ్ పర్‌ఫార్మెన్స్‌కి స్వామి ట్రైలర్ ఓ శాంపిల్ వీడియోలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నట్టు, విక్రమ్ హీరోగా వచ్చిన స్వామి సినిమానే గతంలో తెలుగులో లక్ష్మీ నరసింహ పేరిట రీమేక్ అయిన సంగతి తెలిసిందే.