Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 35 రోజుల పాటు ఆస్పత్రిలో  ఉన్న ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్(chiranjeevi) ట్విట్టర్ ద్వారా చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత నెల 10న తేజ్‌ (Sai Dharam Tej )రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు తేజ్‌. ఇవాళ అపోలో(Apollo) ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. కాగా యాక్సిడెంట్ అనంతరం తొలిసారి అక్టోబర్ 3న ‘రిపబ్లిక్’ సినిమా(Republic Movie)పై చూపించిన ప్రేమ, అప్యాయతలకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు సాయిధరమ్. త్వరలోనే అందర్నీ చూస్తాను అని ఆ రోజున ట్వీట్ చేశాడు సుప్రీం హీరో. ప్రమాదం జరిగిన దాదాపు మూడు వారాల తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ అభిమానులను ట్విట్టర్(Twitter) ద్వారా పలకరించారు.


Also read: Aranya Movie: అరణ్య సినిమా ఓటీటీలో ఇవాళ్టి నుంచి అందుబాటులో


సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు మెగా హీరో సాయిధరమ్(Sai Dharam Tej Accident). అయితే, ఇప్పటివరకు తేజ్ ఆరోగ్యం గురించి రెగ్యులర్ అప్‌డేట్స్ రాకపోవడంతో.. అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో ఫ్యాన్స్‌లో సందడి నెలకొంది. కాగా తాజాగా తేజ్ డిశ్చార్జ్(Sai Dharam Tej Discharge) విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్.



మరో విశేషం ఏమిటంటే నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు(Sai Dharam Tej Birthday). ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులతో పాటు నటీనటులు.. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి