Saidharam tej health condition live updates: హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనే వార్త అందుకున్న మెగా ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, అతడిని కాపాడుకునేందుకు చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, నిహారిక కొనిదెల వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి పరుగులు తీశారు. ఆస్పత్రి వెలుపల మీడియాకు చిక్కిన విజువల్స్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan rushes to hospital), వరుణ్ తేజ్, నిహారిక ఆస్పత్రికి రావడం గమనించొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాయిధరమ్ తేజ్‌ని కుటుంబసభ్యులు (Sai dharam tej family) దగ్గరుండి అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కొక్కరిగా మెగాస్టార్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరూ అపోలో ఆస్పత్రికి చేరుకున్నట్టు సమాచారం. అల్లు అరవింద్ కూడా సాయి ధరమ్ తేజ్‌ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. 


ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం (Sai dharam tej health updates) నిలకడగానే ఉందని అపోలో వైద్యులు డా. అలోక్ రంజన్, డా సుబ్బా రెడ్డి, డా సాయి ప్రసాద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో శరీరంలో అంతర్గతంగా ఇంకా ఏమైనా గాయాలయ్యాయా అని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, మరో 48 గంటలయితే కానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహనకు రాలేమని వైద్యులు వెల్లడించారు. 


ఆస్పత్రి వెలుపల అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని తెలిపారు. ప్రస్తుతానికి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం (Sai Dharam tej health condition) నిలకడగానే ఉందని అల్లు అరవింద్ వెల్లడించారు.