నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా టీజర్ విడుదలైంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శైలజా రెడ్డి పాత్రలో నటించిన సీనియర్ నటి రమ్యకృష్ణ మరోసారి తాను పోషించిన పాత్రతో సినిమాపై అంచనాలను పెంచినట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 31న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్న నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచే ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టిన యూనిట్ సభ్యులు.. అందులో భాగంగా ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాళ రాత్రి 7 గంటలకు టీజర్‌ను విడుదల చేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఈ సినిమాలో చైతూ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా నటించింది. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.