ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ( Rashmi Gautam ) యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సుమ, ఝాన్సి, అనసూయ తరువాత తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనగానే రష్మి గుర్తుకు వస్తుంది. అటు టీవీ రియాల్టీ షోలో యాంకరింగ్ చేస్తూనే... అవకాశం ఉన్నప్పడల్లా నటిస్తుంది. కరోనావైరస్ వల్ల చాలా కాలం ఇంటికే పరిమితం అయిన రష్మి.. ఇటీవలే మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టింది. తాజాగా ఆమెకు కరోనావైరస్ సోకినట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  NEET Results 2020: ఆరు మార్కులు వచ్చాయని... విద్యార్థిని ఆత్మహత్య



కొంత కాలం నుంచి ఆరోగ్య సమస్యలు అనిపించడంతో కోవిడ్-19 ( Covid-19) పరీక్షలు చేయించుకుందట రష్మీ. ఇందులో ఆమెకు కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ జరిగిందట. ఈ విషయాన్ని రష్మీ స్వయంగా తెలిపింది. దాంతో ప్రస్తుతం రష్మీ హోస్ట్ చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేశారు. కొంత కాలం రష్మీ ఏ షూటింగ్ లో పాల్గొనబోరు.



Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


ప్రస్తుతం రష్మి నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ సమయంలోనే రష్మికి కోవిడ్-19 వైరస్ సోకిందని సమాచారం. దాంతో కొద్ది కాలం ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR