కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన "టైగర్ జిందా హై" పోస్టర్ ఎట్టకేలకు విడుదలైంది. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం క్రిస్‌మస్‌కు విడుదల కానుంది. అయితే దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సల్మాన్ ఓ స్పెషల్ లుక్‌‌తో కనిపిస్తున్నారు. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల అంచనాలను భారీగా పెంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2007లో విడుదలైన సూపర్ హిట్ సినిమా "ఏక్ థా టైగర్"కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతుంది. ఈ సినిమాతో మరల "సుల్తాన్" సినిమా టీమ్ ఏకమవడంతో మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే బయ్యర్స్ భావిస్తున్నారు. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, జులియస్ పకియమ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అదేవిధంగా కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం.