Tollywood Camera man Died: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట రమణ కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూసారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఆయన నేటివ్ ప్లేస్ మచిలీ పట్నం. ఈయన ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు వంటి పలు ఎంటర్టైన్మెంట్ సీరియల్స్‌కు కెమెరా మాన్‌గా పనిచేసారు. అటు SVBC ఛానెల్‌లో నిర్మించిన 'శ్రీ వైనతేయ' ధారావాహికకు 2009 యేడాదిగాను బెస్ట్ కెమెరా మాన్‌గా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు పూరీ జగన్నాథ్ ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకున్న దూరదర్శన్ టెలిఫిల్మ్ 'జీవితం' కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పోతన వెంకట రమణకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన మృతికి టవి కెమెరా మ్యాన్‌ల సంఘంతో పాటు టీవీ పరిశ్రమలోని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు


Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook