Tollywood: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు సతీ వియోగం కలిగింది. అనారోగ్య కారణాలతో చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు భార్య మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భార్య లక్ష్మీ కళ్యాణి కన్నుమూశారు. శనివారం అంటే మే 28వ తేదీ రాత్రి 9 గంటలకు తన భార్యతో 62 ఏళ్ల భాగస్వామ్యానికి ముగింపు పడిందని సింగీతం శ్రీనివాసరావు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాత్రి చెన్నైలో మరణించారు. 


సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లో లక్ష్మీ కళ్యాణి పాత్ర కీలకం. సినిమా స్క్రిప్ట్ రాయడంలో లెజంజరీ దర్శకుడికి ఆమె సహాయం చేసేవారు. ఆమెపై సింగీతం శ్రీనివాసరావు శ్రీకళ్యాణీయం అనే పుస్తకాన్ని కూడా రాశారు. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే మూవీలో కన్సల్టెంట్‌గా ఉండేందుకు అంగీకరించినా..ఆ తరువాత అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


Also read: Video: బోల్డ్ టాక్... ప్రైవేట్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన టాప్ డైరెక్టర్ కూతురు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook