భరత్ అనే నేను సినిమా విడుదలకు మరో రెండు వారాలే మిగిలి వుండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యింది. ఇటీవల కాలంలో వరుసగా విడుదలవుతున్న పోస్టర్స్, పాటలు, టీజర్ వీడియోలకు అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోన్న నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి ముచ్చటగా మూడో పాటను విడుదల చేశారు. " వచ్చాడయ్యో సామి " అంటూ సాగే ఈ పాటని తెలుగు వారికి సుపరిచితుడైన ఉత్తరాది నేపథ్యగాయకుడు కైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో రూపొందిన ఈ పాట సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. యూట్యూబ్‌లో రిలీజైన తొలి నాలుగైదు గంటల్లోనే ఈ పాట 2 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇక పాటలో మహేష్ బాబు పంచెకట్టులో కనిపించడం ఈ పాటపై క్రేజ్ పెరగడానికి మరో కారణమైంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. మహేష్ బాబు సరసన 'ఎం.ఎస్. ధోనీ' ఫేమ్ కైరా అద్వానీ జంటగా నటించింది. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. మహేష్ బాబు ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.