Vice President Of India Venkaiah Naidu and Hero Nandamuri Balakrishna appreciates to Sandhya Raju's Natyam movie:నాట్యం.. చిత్ర బృందానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, (Venkaiah Naidu) హీరో నందమూరి బాలకృష్ణలు (Nandamuri Balakrishna) అభినందలు తెలిపారు. నటి సంధ్యారాజుని వెంకయ్య నాయుడు సత్కరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం నాట్యం. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ( Sandhya Raju) ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి రేవంత్‌ కోరుకొండ (revanth korukonda) దర్శకత్వం వహించారు.


నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నాట్యం చిత్రం చక్కగా నటించారు అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) పేర్కొన్నారు. అలాగే భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు రేవంత్‌ కోరుకోండ, నటీనటులకు అభినందలు తెలిపారు. 



 


Also Read : Deepika Ranveer to Bid IPL Team: ఐపీఎల్ ప్రాంచైజీ రేసులో బాలీవుడ్ స్టార్ కపుల్..??


ఇక స్పెషల్‌ షో చూసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. నాట్యం.. చిత్రం ఓ కళాఖండం బాలయ్య ప్రశంసించారు. దర్శకుడు రేవంత్‌ అనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించారన్నారు. నాట్యం (Natyam) మూవీలోఆదిత్య మేన‌న్‌, రోహిత్ బెహ‌ల్‌, క‌మ‌ల్ కామ‌రాజు, భానుప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌ త‌దిత‌రులు నటించారు. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.


Also Read : Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook