'కరోనా వైరస్'.. లాక్ డౌన్ వేళ. . బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఊసుపోవడం లేదు. కొత్త కొత్త ఛాలెంజ్‌లతో హల్‌చల్  చేస్తున్నారు. కుర్రకారు మనసు దోచేస్తున్నారు. యువత కూడా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉన్నారు కాబట్టి.. బాలీవుడ్ సెలెబ్రిటీస్ పెట్టిన కొత్త కొత్త ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి.  కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో కొత్త ఛాలెంజ్..! అవును .. ఈసారి తలగడ ఛాలెంజ్..!! తస్సాదియ్యా.. యువత మనసును దోచేయడానికి రంగంలోకి దిగిందీ  కొత్త ఛాలెంజ్. పిల్లో ఛాలెంజ్ పేరుతో ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది. దీన్ని తొలిసారిగా హాలీవుడ్ హీరోయిన్ అన్నే హ్యాత్ వే  ప్రారంభించింది. అలా అలా వైరల్ అవుతున్న ఈ ఛాలెంజ్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. యువతకు కిర్రెక్కిస్తున్నారు.