మహానేతగా పేరున్న దివంగత మాజీ ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖర్ రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ రిలీజైంది. యాత్ర పేరిట మహీ వి రాఘవ్ రచించి, డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రను పోషిస్తున్నారు. ముఖ కవలికల్లో వైఎస్సార్‌కి దగ్గరి పోలికలు వుండే గొప్ప నటుడు అయిన మమ్ముట్టి అయితేనే ఈ సినిమాకు సరిగ్గా సూట్ అవుతారనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాతలు ఆయన్ని వైఎస్సార్ పాత్ర కోసం ఎంచుకున్నారు. విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. నిన్న టైటిల్ లోగో రిలీజ్ చేసిన మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వైఎస్సార్ పాత్రలో నటించనున్న మమ్ముట్టి అచ్చం వైఎస్సార్ తరహాలోనే పంచె కట్టులో కనిపించి ఆకట్టుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


" చరిత్రలో తనకంటూ ఓ పేజీ వుండాలనుకున్న వైఎస్సార్.. ఏకంగా ప్రజల హృదయాల్లోనే చెరగని ముద్ర వేసుకున్నారు " అనే అర్థం వచ్చే విధంగా పోస్టర్‌పై కనిపిస్తున్న టెక్ట్స్ సైతం వైఎస్సార్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో మమ్ముట్టి తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా షేర్ చేసుకున్న యాత్ర ఫస్ట్ లుక్‌కి సైతం భారీ స్పందన కనిపిస్తోంది. మమ్ముట్టి షేర్ చేసుకున్న నాలుగైదు గంటల్లోనే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి 2,200లకు పైగా షేర్స్ లభించడం చూస్తే, యాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి వున్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య కనిపించనున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.