న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్ ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఒకేసారి నలుగురు వీడియో కాల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దీనిని 8 మందికి పెంచింది. అయితే, ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా అతి త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుందని పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Coronavirus updates: 19 వేలకు చేరువలో కరోనా కేసులు, 603కి చేరిన మృతుల సంఖ్య


జూమ్, గూగుల్ డ్యుయో యాప్‌లు ఈ విషయంలో ముందుండడంతో ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ విషయమై దృష్టి సారించి వీడియో కాలింగ్ సామర్థ్యాన్ని 8 మందికి పెంచింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.20.133 బీటా, ఐవోఎస్‌ 2.20.50.25 బీటా వెర్షన్ల ద్వారా అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లోనే మొత్తం వాట్సాప్ వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, వినియోగదారుల వద్ద ప్రస్తుతం బీటా వెర్షన్ ఉన్నప్పటికీ, ఇది వినియోగించే వ్యక్తుల వద్ద కూడా అది అందుబాటులో ఉంటేనే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం సాధ్యం అవుతుందని తెలిపింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..