పెళ్లి తర్వాత బాలీవుడ్ నటి దీపికా పదుకొనె (Deepika Padukone) కెరీర్ అంతకు ముందు రేంజ్‌లోనే దూసుకెళ్తోంది. కానీ ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మకేసు అనంతరం డ్రగ్స్ కేసు తెరపైకి రావడంతో దీపికను కాస్త ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కేసులో విచారణను సైతం ఎదుర్కొంటున్న దీపికా పదుకొనె మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఓ సినిమాకు దీపిక సంతకం చేసింది. ప్రస్తుతం ఆ సినిమా ఏంటి, దీపికకు అంత పారితోషికమా అని బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.



 


యశ్‌రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో దీపికా పదుకొనె నటించనున్న సినిమా పఠాన్. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దీపిక డిమాండ్ చేసిన పారితోషికం (Deepika Padukone Remuneration) అందుబోతుందని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పూర్తి స్థాయిలో యాక్షన్ కమ్ థ్రిల్లర్ మూవీ. పఠాన్ సినిమాకుగానూ దీపికా పదుకొనె రూ.14 నుంచి రూ.15 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుబోతోంది. ఈ విషయం ప్రచారం కాగానే బాలీవుడ్ సర్కిల్స్‌లో అవునా, నిజమేనా అంటూ హీరోయిన్ల పారితోషికాలపై చర్చ మొదలైంది. 



 


పఠాన్ మూవీకిగానూ జాన్ అబ్రహంకు రూ.20 కోట్ల మేర డీల్ కుదిరింది. ఇందులో జాన్ అబ్రహం పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందని సమాచారం. అయితే స్టార్ హీరో షారుక్ ఖాన్ రెమ్యునరేషన్ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. వచ్చే ఏడాది దీపావళికి పఠాన్ విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ చెబుతోంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook