ముంబై: కపూర్ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైనా తన నటనతో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని ఏలిన నటి కరిష్మా కపూర్. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కరిష్మా.. తాజాగా జీ5లో విడుదల కానున్న మెంట్ హుడ్ అనే వెబ్ సిరీస్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ నటి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తనదైన ముద్రవేశారు. అయితే అనూహ్యంగా వెబ్ సిరీస్ దారి పట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీలక ఘట్టం.. ఆ కీచకుడికి 23ఏళ్ల జైలుశిక్ష!


ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరిష్మ చెప్పిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా 24 ఏళ్ల కిందట చేసిన ఘాటు ముద్దు సీన్ కావడం గమనార్హం.  కరిష్మా కపూర్, ఆమీర్ ఖాన్ కెరీర్‌లో హిట్ సినిమాలలో రాజా హిందూస్థానీ ఒకటి. ధర్మేష్ దర్శన్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ఆ సినిమాలో కరిష్మా, ఆమీర్ కెమిస్ట్రీని బాలీవుడ్ ఫ్యాన్స్ ఇప్పటికీ మరిచిపోలేరు. ఆమీర్‌తో చేసిన గాఢ చుంబనంపై 24ఏళ్ల తర్వాత నటి స్పందించారు.


అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరితో సినిమా.. షూటింగ్ దాదాపు పూర్తి


అది ఫిబ్రవరి నెలలో ఆ లిప్ కిస్ సీన్ చిత్రీకరించారని, అందులోనూ చలి ప్రదేశం హూటీ కావడంతో కాస్త ఇబ్బంది పడ్డానని చెప్పారు. వణుకుతూనే ఆమీర్‌తో గాఢమైన ముద్దు సీన్ చేశానని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు సీన్ చేస్తుంటే ఓవైపు వణుకు, మరోవైపు ఘాటు ముద్దు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తాను ఈ సీన్ చేస్తానో లేదోనని ఆమీర్ ఖాన్ కాస్త సందేహించారని అయితే ముద్దుసీన్ బాగా వచ్చిందని కరిష్మా చెప్పుకొచ్చారు.


మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..