కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న "భరత్ అను నేను" కొత్త పోస్టరును ఈ రోజు రాత్రి 7 గంటలకు హీరో మహేష్ బాబు తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. అందులో "భరత్ అను నేను" సినిమాకి సంబంధించిన ప్రత్యేక గీతం మార్చి 25 రాత్రి 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ కథానాయిక కైరా అద్వానీ తొలిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమవబోతున్నారు. అలాగే తమిళ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో "శ్రీమంతుడు" చిత్రంలో నటించి మంచి హిట్ సొంతం చేసుకున్న మహేష్ బాబుకి... అదే డైరెక్టర్‌ తో "భరత్ అను నేను" రెండవ చిత్రం కావడం విశేషం


ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో మిథున్ చక్రవర్తి ఇదే చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, పి రవిశంకర్, రావు రమేష్, పోసాని క్రిష్ణమురళి, ఆమని, సితార ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అలాగే శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.