మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాని, నాగచైతన్యతో పాటు పలువురు కీలక వ్యక్తులు కూడా పాల్గొన్నారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల పట్ల, అందుకు సంబంధించి చిత్రసీమ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న అంశాల పట్ల ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చర్చలో ఏ అంశాలు మాట్లాడారన్న విషయం పై ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదు. కొన్ని నెలల క్రితం చిత్రసీమలో డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కూడా టాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే.


అలాగే ఇటీవలి కాలంలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఉద్యమం లేవదీయడానికి ప్రయత్నించిన శ్రీరెడ్డికి మా సంస్థ సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించడం.. ఆ తర్వాత మళ్లీ ఇస్తామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ విషయంలో దూషణలకు దిగడంతో ఆయన ఘాటుగా స్పందించారు.


ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ అంశానికి సంబంధించి తన పాత్ర గురించి కూడా బహిర్గతం చేశాక పవన్ బాగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి అంశాలను ప్రసారం చేసిన మీడియా ఛానళ్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో జరుగుతున్న ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సీరియస్‌‌గా తీసుకున్నట్లు సమాచారం.


అందుకే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కీలక వ్యక్తులతో ఆయన మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారన్న విషయం గురించి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదు