"సైరా" సినిమా తర్వాత మెగాస్టార్ తాను ఓ యువ దర్శకుడి చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. ఇటీవలే "మహానటి" చిత్రంతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన చిత్రం ఉండనున్నట్లు చిరంజీవి తెలిపారు. ఈ చిత్రం గతంలో ఎన్టీఆర్ నటించిన "పాతాళ భైరవి" చిత్రాన్ని పోలి ఉంటుందని... అలాగే టైమ్ మెషీన్ నేపథ్యంలో సరికొత్త కథాంశంతో తెరకెక్కబోతుందని తెలిపారు.


చిత్రమేంటంటే.. ఈ చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలను వైజయంతి మూవీస్‌ సంస్థే చూసుకుంటుందట. ఇటీవలే చిరంజీవి "మహానటి" సినిమా దర్శకుడు, నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. వైజయంతి మూవీస్‌ సంస్థ గతంలో చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా  ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’  చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ‘మహానటి’ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ ఆశ్విన్ "ఎవడే సుబ్రహ్మణ్యం" చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.