ముంబై: బాలీవుడ్ స్టార్ సుశాంత్ రాజపుత్ ఆత్మహత్య యావత్తు దేశాన్ని కలిచివేస్తోంది. బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలకు దారితీస్తోందని కంగనా రనౌత్ ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను నాశనం చేసింది ఎవరో తనకు తెలుసంటూ డైరెక్టర్ శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆదివారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫర్లు లేకపోవడంతో ఒత్తిడికి గురై సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.  వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST )

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kangana Ranaut on Sushant`s suicide: సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్


 


'పానీ' అనే సినిమాపై చర్చలు జరిగే సమయంలో డైరక్టర్ శేఖర్ కపూర్ కు హీరో సుశాంత్ మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహంతోనే సుశాంత్ తన భుజం పై తలపెట్టి ఎన్నిసార్లు ఏడ్చాడో అంటూ డైరక్టర్ ట్వీట్ చేశారు. నువ్వు ఎంత బాధ అనుభవించావో నాకు తెలుసు. నిన్ను పతనం చేసిన వాళ్ల గురించి తెలుసు. నువ్వు వాళ్ల కారణంగా బాధ అనుభవిస్తూ నా భుజంపై తలపెట్టి ఏడ్చేవాడివి అంటూ నువ్వు కలిసి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిందంతా వాళ్ల కర్మ, నీది కాదు అని ఆయన ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ ను పతనానికి కారణమైన వారు ఎవరు అనేది శేకర్ కపూర్ పేర్లు వెల్లడించలేదు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..