Shocking incident: ''మాకు వయసుతో సంబంధం లేదు. సమాజం ఏమనుకుంటుందన్న ఆలోచన అసలే లేదు. ఇష్టపడ్డం అందుకే పెళ్లి చేసుకున్నాం'' అని చెబుతోంది ఓ మామకోడలి జంట. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 70 ఏళ్ల మామ గారు తన 28 ఏళ్ల కోడలను గుడిలో పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా బర్హల్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కైలాష్ యాదవ్. అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. వీరికి నలుగురు పుత్రులు. కైలాష్ నలుగురు పిల్లలలో మూడో కొడుకు వివాహనంతరం మరణించాడు. అతని భార్య పేరు పూజ. భర్త మృతి చెందడంతో ఆమె మామగారి ఇంట్లోనే ఉంటుంది. కోడలి ఒంటరి తనాన్ని చూడలేకపోయిన కైలాస్ ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. అదే విషయాన్ని పూజకు చెప్పడంతో ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించి మామ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 


లేటు వయసులో కోడలిని వివాహం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు వీరి పెళ్లి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పెళ్లిని సమర్థిస్తుంటే.. మరికొందరు ఈ వయసులో ఇదేం బుద్దిని విమర్శిస్తున్నారు. 


Also Read: Viral Video: మాటకు మాట.. తగ్గేదేలే.. వైరల్ అవుతున్న క్యూట్ గాళ్ వీడియో 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook