టాలీవుడ్ హీరో గోపీచంద్ గాయాల పాలయ్యాడు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఘూటింగ్ సమయంలోఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా బైక్ పై నుంచి గోపిచంద్  కింద పడ్డాడు. కాగా చిత్ర యూనిట్ ఆయనకు స్టానిక ఆస్పత్రికి తరలించింది. 


గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రం సినిమా ఘూటింగ్ రాజస్థాన్ లోని  జైపూర్ లో  జరుగుతోంది. ఈ క్రమంలో  ఓ యాక్షన్ సన్నివేశం చిత్రకరిస్తుండగా ఆయన గాయపడినట్లు తెలిసింది. గాయపడ్డ గోపిచంద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.