శ్రీదేవి వారసురాలిగా వెండితెరపై అరంగ్రేటం చేసిన జాన్వీ కపూర్.. తన తొలి  సినిమా 'ధడక్' లో అంచనాలకు తగట్టు నటించింది. తన నటన, అందచందాలతో ప్రేక్షకులను అలరించి  కోట్ల మంది అభిమానులను అతి తక్కువ సమయంలో సంపాదించింది. జాన్వీ కపూర్ పేరు వింటే కుర్రకారు ఫిదా అయిపోతున్నారు... అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి మరో పెద్ద ఆఫర్ వచ్చిపడింది. పద్మావత్ మూవీ తరహా చారిత్రక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రూ.500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా టైటిల్ ఖరారు..


భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో హీరో ఛాన్స్ రణ్ వీర్ సింగ్ కు ఇచ్చినట్లు టాక్..కాగా ఈ మూవీకి 'తక్త్' ( తెలుగు అర్థం - సింహాసనం ) అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. సింహాసనం కోసం కొనసాగే పోరాట చిత్రంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో జాన్వీ కపూర్ ఆనందానికి అవధుల్లేవట. తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన జాన్వీ.. తన రెండో సినిమాలో ఎలా కనిపిస్తోందనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు